ఖండాంతరాల్లో మరోసారి మోగనున్న ప్రభాస్ పేరు.?

ఖండాంతరాల్లో మరోసారి మోగనున్న ప్రభాస్ పేరు.?

Published on Aug 15, 2020 10:46 AM IST

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా కోసం ప్రత్యేకంగా మనం ఎవరికీ పరిచయం చేయనక్కర్లేదు. ఈ సినిమాతోనే ప్రభాస్ పేరు కూడా ప్రపంచ వ్యాప్తంగా మారు మోగింది. ఈ చిత్రం విడుదల కాబడి ఐదేళ్లు పూర్తయినప్పటికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి మ్యానియా ఇంకా అలా కొనసాగుతూనే ఉంది.

ఆ మధ్యనే రష్యా దేశంలో టెలీకాస్ట్ కాబడిన మొదటి తెలుగు చిత్రంగా మన తెలుగు ఇండస్ట్రీకి అరుదైన గౌరవం తెచ్చిన చిత్రంగా మరియు మొదటి తెలుగు హీరోగా ప్రభాస్ మరో మెట్టు పైకెక్కకగా ఇప్పుడు మరోమారు ప్రభాస్ పేరు ఖండాంతరాల్లో మోగనున్నట్టుగా తెలుస్తుంది.

తూర్పు ఆసియా దేశం అయినటువంటి మంగోలియాలో “బాహుబలి ది బిగినింగ్” చిత్రం డబ్ అయ్యి అక్కడ టెలికాస్ట్ కానున్నట్టుగా ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. అక్కడి ఛానెల్ అయినటువంటి టీవీ5 మంగోలియా ఛానెల్లో ఈ ఆగష్టు 16 వ తారీఖున ఈ చిత్రం టెలికాస్ట్ కానుందట. దీనితో డార్లింగ్ పేరు మరోమారు ఖండాంతరాల్లో మారుమోగనుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు