తుది దశకు చేరుకున్న’పందెంకోడి 2′ చిత్రీకరణ !

తుది దశకు చేరుకున్న’పందెంకోడి 2′ చిత్రీకరణ !

Published on Jul 12, 2018 1:10 AM IST


తమిళ హీరో విశాల్ , కీర్తి సురేష్ జంటగా లింగు సామి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సందకోడి 2’. 2005లో విశాల్ , మీరాజాస్మిన్ జంటగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘సందకోడి’ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈచిత్రం తెలుగులో ‘పందెం కోడి 2’ పేరుతో విడుదల కానుంది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కరైకుడి లో జరుగుతుంది. ఆగష్టులో ఈ చిత్ర షూటింగ్ ను పూర్తిచేసి అక్టోబర్ 18 న తెలుగు , తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని విశాల్ సొంత సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు