యాక్షన్ హీరో విశాల్ కి ‘పందెంకోడి’ చిత్రం ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాతోనే ఆయన తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరయ్యారు. కాగా ఆ చిత్రం వచ్చిన పన్నెండు సంవత్సరాలకి ఆ చిత్రానికి. సీక్వెల్గా ‘పందెం కోడి 2’ తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో విశాల్ సరసన కీర్తీ సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ వరలక్ష్మీ శరత్కుమార్ విశాల్ సరసన ఆడిపాడనుంది. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సీక్వెల్ షూటింగ్కి ఆదివారంతో పూర్తి అయింది. ఇక ఈ సినిమా అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.