రెండు వేడుకలతో సందడి చేయనున్న గోపిచంద్ !

రెండు వేడుకలతో సందడి చేయనున్న గోపిచంద్ !

Published on Jun 17, 2018 1:28 PM IST

హీరో గోపీచంద్ చేసిన తాజా చిత్రం ‘పంతం’. నూతన దర్శకుడు కె.చక్రవర్తి దర్శకత్వంలో ఈ చిత్ర్రం రూపొందుతోంది. షూటింగ్ పూర్తైన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి స్పందన తెచ్చుకోవడంతో టీమ్ ఉత్సాహంగా ప్రమోషన్లు చేస్తోంది.

వాటిలో భాగంగా ఈ నెల 21వ తేదీన విజయవాడలో ఆడియో వేడుకను నిర్వహించనున్నారు. ఆ తరవాత జూన్ 24న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫి చేస్తుండగా గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. గోపీచంద్ కు జోడీగా మెహ్రీన్ కౌర్ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రం జూలై 5వ తేదీన విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు