రేపు విడుదలకానున్న రెండు సినిమాల ట్రైలర్స్ !

రేపు విడుదలకానున్న రెండు సినిమాల ట్రైలర్స్ !

Published on Jun 24, 2018 6:07 PM IST

త్వరలో విడుదలకు సిద్దమవుతున్న రెండు చిత్రాల ట్రైలర్లు రేపు విడుదల కానున్నాయి . దానిలో మొదటగా హీరో గోపిచంద్, మెహ్రీన్ జంటగా నూతన దర్శకుడు చక్రవర్తి తెరకెక్కించిన చిత్రం పంతం . ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జులై 5న విడుదలకు సిద్దమవుతోంది. గోపిచంద్ కి ఇది 25వ సినిమా మంచి సోషల్ కాజ్ తో రాబోతున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ని రేపు ఉదయం 9 గంటల 15 నిమిషాలకు విడుదల చేయనున్నారు .గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న గోపిచంద్ ఈ చిత్రం ఫై చాలా ఆశలు పెట్టుకున్నాడు సత్యసాయి ఆర్ట్స్ పతాకంఫై కే కే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందించారు .

ఇక రెండవ చిత్రం కరుణాకరన్ దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘తేజ్ ఐ లవ్ యు’ . ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రేపు రాత్రి 7 గంటలకు విడుదల చేయనున్నారు .ఇక తేజు కూడా ఈ మధ్యన వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నాడు ఈ సినిమా తో ఎలాగైనా హిట్ కొట్టి మళ్ళి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆశపడుతున్నారు . అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ ఫై కే ఎస్ రామారావు నిర్మించారు . ఈ సినిమా జులై 6న ప్రేక్షకుల ముందుకు రానుంది .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు