యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ హీరోగా యువ నటి పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా దర్శకుడు ఎస్ పి దుర్గాప్రసాద్ తెరకెక్కించిన లేటెస్ట్ విలేజ్ డ్రామానే పాపం ప్రతాప్. ఒక వింతైన వ్యాధి ఉందని పెళ్ళైన కొంత సమయంలోనే తన భర్తను వదిలేసి హీరోయిన్ వెల్లిపోతుంది. అక్కడ నుంచి ప్రతాప్ పడ్డ తిప్పలు ఏంటి మళ్లీ భార్యను ఎలా వెనక్కి తెచ్చుకున్నాడు అనేది ఇందులో మెయిన్ కథ.
అయితే థియేటర్స్ లో అనుకున్నంత రేంజ్ లో రాణించని ఈ సినిమా ఇపుడు ఫైనల్ గా ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ సినిమా హక్కులు ఈటీవీ విన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇవాళ్టి నుంచి అందులో ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. సో అప్పుడు చూడనివారు ఉంటే ఇప్పుడు చూడొచ్చు. ఇక ఈ సినిమాలో అజయ్ ఘోష్ కూడా కీలక పాత్రలో నటించగా క్రిష్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి
