‘రంగమార్తాండ’ కోసం పరుచూరి బ్రదర్స్ !

‘రంగమార్తాండ’ కోసం పరుచూరి బ్రదర్స్ !

Published on Oct 22, 2019 9:43 PM IST

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ‘కృష్ణ వంశీ’ తాజాగా నటసామ్రాట్ అనే మరాఠీ సూపర్ హిట్ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తయింది. అయితే ప్రస్తుతం పరుచూరి బ్రదర్స్ ఫైనల్ వర్షన్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నారట. ఇక డిసెంబర్ నుండి ‘రంగమార్తాండ’ షూటింగ్ ను కృష్ణవంశీ ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.

కాగా ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ చేస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ‘కృష్ణ వంశీ’ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోతున్నాయి. మరి ఈ సినిమాతోనైనా మళ్ళీ కృష్ణవంశీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు