’ఉస్తాద్ భగత్ సింగ్’ ఘోర పరాజయం తర్వాత పవర్స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించాడు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం, వెన్నునొప్పి కారణంగా తరచూ అనారోగ్యానికి గురికావడంతో భవిష్యత్తులో కొత్త చిత్రాలేవీ చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నాడు.
పవన్ కళ్యాణ్తో సినిమాలు చేయాలనుకున్న మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ వంటి నిర్మాణ సంస్థలు ప్రస్తుత పరిస్థితితో సైలెంట్ అయ్యాయి. సురేందర్ రెడ్డి స్క్రిప్ట్పై పవన్ అసంతృప్తిగా ఉండగా, సుజీత్ ‘OG’ సీక్వెల్ పనులు కూడా త్వరలో మొదలయ్యేలా లేవు.
ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్తో పాటు ఆయన నిర్మాతలు కూడా పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లారు. రాజకీయ, ఆరోగ్య కారణాల దృష్ట్యా ఈ ఏడాది ఆయన ఎలాంటి సినిమా షూటింగ్లలో పాల్గొనే అవకాశం కనిపించడం లేదు.


