సాయి ధరమ్ తేజ్ నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ విడుదలైన చోట్ల మంచి స్పందనని అందుకుంటూ విజయపధాన దూసుకుపోతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నైజాంలో రెండు కోట్ల 40లక్షలను సాధించింది
ఈ సినిమాలో సాయి సరసన రెజినా కాసేండ్రా హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు ముఖ్యపాత్ర పోషించాడు. ఏ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకుడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మించారు


