కోలీవుడ్ స్టార్ విక్రమ్ హీరోగా కార్తీ, జయం రవి లు కీలక పాత్రల్లో ఐశ్వర్య రాయ్ మరియు త్రిష లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “పొన్నియిన్ సెల్వన్ 2” కోసం అందరికీ తెలిసిందే. దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం మరి మొదటి భాగం భారీ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ పై కూడా మంచి హైప్ నెలకొంది. ఇక ఈ చిత్రం కూడా రికార్డు వసూళ్లు అయితే వరల్డ్ వైడ్ గా రాబడుతుంది.
ముఖ్యంగా యూఎస్ లో సెన్సేషనల్ రన్ తో అయితే పొన్నియిన్ సెల్వన్ 2 దూసుకెళ్తుంది. లేటెస్ట్ గా 3.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసిన ఈ చిత్రం ఈరోజు కి అయితే ఈజీగా 4 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేయనున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా యూఎస్ లో టాప్ 8వ చిత్రంగా ట్రెండింగ్ లో నిలిచింది. దీని బట్టి ఈ సినిమా హవా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
Over 3.5 million $ grossed in the first weekend! Thank you for the love! #PS2 makes its mark at number 8 at the US weekend box office!#PS2Blockbuster#CholasAreBack#PS2 #PonniyinSelvan2 #ManiRatnam @arrahman @madrastalkies_ @LycaProductions @RedGiantMovies_ @Tipsofficial… pic.twitter.com/CUJxejflk8
— Lyca Productions (@LycaProductions) May 2, 2023


