యంగ్ హీరోకి నో చెప్పిన పూజా హెగ్డే

యంగ్ హీరోకి నో చెప్పిన పూజా హెగ్డే

Published on Aug 4, 2020 10:32 AM IST

ఆయుష్మాన్ ఖురానా హీరోగా రాధికా ఆప్టే, టబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన అంధాదున్ మూవీ మంచి విజయం సాధించింది. ఆ మూవీలో నటనకు గాను హీరో ఆయుష్మాన్ ఖురానా జాతీయ ఉత్తమనటుడు అవార్డు గెలుచుకున్నాడు. ఈ హిందీ చిత్రాన్ని తెలుగులో హీరో నితిన్ రీమేక్ చేయనున్నాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ మూవీ రీమేక్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. కాగా ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కొరకు పూజా హెగ్డే ని సంప్రదించగా ఆమె నో చెప్పారని తెలుస్తుంది.

మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి పూజ నో చెప్పడం వెనుక కారణం ఏమిటీ అనేది తెలియదు. టాలీవుడ్ కి మాత్రం పూజ నో చెప్పినట్లు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక నితిన్ హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన రంగ్ దే ఆయన తదుపరి చిత్రంగా విడుదల కానుంది. ఇటీవల నితిన్ పెళ్లి సంధర్భంగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు