ప్రభాస్ సినిమా కోసం విదేశాలనే ఇక్కడికి?

ప్రభాస్ సినిమా కోసం విదేశాలనే ఇక్కడికి?

Published on May 20, 2020 1:00 AM IST

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూస్తూనే ఉన్నాము. దానితో సినిమా పరిశ్రమకు కూడా పెద్ద బ్రేక్ పడింది. దీనితో మన టాలీవుడ్ నుంచి కొన్ని కీలక చిత్రాలు ఇతర దేశాల్లో షూటింగ్స్ జరుపుకోవాల్సినవి ఆగాల్సి వచ్చింది. అయితే ఒకవేళ మళ్ళీ షూటింగ్స్ ప్రారంభం అయినప్పటికి ఇతర దేశాలకు వెళ్లి షూటింగ్ చేసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

దీనితో ఇతర దేశాలను భారీ సెట్టింగులు ద్వారా సినిమాకు ఎంత వరకు అవసరమో అంతవరకు ఇక్కడే ప్రభాస్ నుంచి రాబోతున్న “ఓ డియర్” లో కనిపించనున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధ కృష్ణ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం వింటేజ్ ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది.

అందులో భాగంగా ఈ సినిమా ఎక్కువ టాకీ పార్ట్ ఇతర దేశాలలో తియ్యాల్సి ఉంది. ఇప్పటికే చాలా వరకు బయట జరిగినా ఇక మీదట మాత్రం ఆ బయట లొకేషన్లనే ఇక్కడికి తీసుకురాబోతున్నారట. అన్ని కీలకమైన షాట్లకు మన దగ్గరే పర్ఫెక్ట్ సెట్టింగ్స్ వేసి మంచి అవుట్ ఫుట్ ఇవ్వాలని టీం అనుకుంటున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు