ప్రభాస్ బాగా ఇంట్రస్టింగ్ గా ఉన్నాడట !

ప్రభాస్ బాగా ఇంట్రస్టింగ్ గా ఉన్నాడట !

Published on Mar 7, 2021 1:19 AM IST

నేషనల్ స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ ల ప్రాజెక్ట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కు మొదటినుండీ కాస్త ఎక్కువ ఆసక్తి ఉంది. కాగా వీఎఫ్‌ఎక్స్ తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రం 2022 లో పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది. కాగా నిర్మాతగా తన జాతి రత్నలు చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్న నాగ్ అశ్విన్ తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ తో సినిమా గురించి మాట్లాడుతూ.. “ఈ ప్రాజెక్ట్ గురించి ప్రభాస్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అలాగే షూటింగ్ కోసం ఎక్కువ డేట్స్ ను కేటాయించటానికి అంగీకరించాడు. అంతేకాకుండా, ఈ సంవత్సరం జూలై నుండి షూటింగ్ ప్రారంభమవుతుంది” అని నాగ్ అశ్విన్ ధృవీకరించారు.

కాగా ఈ సినిమాలో ప్రభాస్’కి అమ్మగా సీనియర్ స్టార్ హీరోయిన్ ‘రేఖ’ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో అమితాబ్ కూడా నటిస్తున్నారు. అమితాబ్ కి భార్యగానే రేఖను తీసుకున్నారని.. వీరిద్దరిది హాట్ పెయిర్ కాబట్టి.. ఆ రకంగా సినిమాకి బాగా ప్లస్ అవుతుందని నిర్మాత అశ్వనీదత్ ప్లాన్ చేశాడట. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా నేపథ్యం మొత్తం ఓ దీవిలో జరుగుతుందని.. ఆ దివి తాలూకు సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని, ప్రభాస్ గెటప్ కొత్తగా ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు