రేపు ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2 శాటిలైట్ ప్రయోగంలోని కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇస్రో పంపిన రోవర్ చంద్రునిపై దిగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టం చూడటంకోసం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ సంఘటన అందరూ ప్రత్యక్షంగా చూడాలంటూ పిలుపునిచ్చారు. అలాగే ఆయన బెంగుళూరులోని ఓ స్కూల్ విద్యార్థులలో కలిసి ఈ అరుదైన సంఘటన వీక్షించనున్నారు.
కాగా ఈ సందర్భంగా ప్రధానిని ఉద్దేశిస్తూ చంద్రయాన్ 2 పై సెటైర్ వేశారు నటుడు ప్రకాష్ రాజ్. “సుప్రీం లీడర్ నేడు పిల్లలతో కలిసి చంద్రుడిని చూస్తాడు, కానీ చంద్రుడు మాత్రం కాశ్మీర్ లో బడికి దూరమైన పిల్లలను, వివక్షత కారణంగా ఉద్యోగాలు, పౌరసత్వం కోల్పోయిన తల్లిదండ్రులను చూస్తాడు. మరి పౌరులమైన మనం ఏమి చూడాలి? , జస్ట్ ఆస్కింగ్” అని ట్వీట్ చేశారు. కాశ్మీర్ లో ప్రస్తుత పరిస్థులకు, అనిచ్చితికి, ప్రధాని నరేంద్ర మోడీనే కారణం అని అర్థం వచ్చేలా ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
MOON WATCHING…Supreme leader will watch the MOON tonight with CHILDREN.. while MOON will be watching those children in Kashmir who have not gone to school…and Across the country..whose parents are abused..lost jobs..citizenship..what will we CITIZENS watch..#justasking
— Prakash Raj (@prakashraaj) September 6, 2019