ప్రస్తుతం తమన్న ప్రధాన పాత్రలో క్వీన్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు . ఈ చిత్రాన్ని నీలకంఠ తెరేకేక్కిన్చాల్సి ఉండగా అనివార్య కారణాలతో మధ్యలోనే తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాని అవె సినిమా తో తెలుగు తెరకు పరిచియమైన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయనున్నాడు.
ఈ విషయాన్నీ అఫిషియల్ గా కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు.అవె సినిమా తో విమర్శకుల ప్రశంసలు పొందిన ప్రశాంత్ ఈ సినిమాని ఏవిదంగా తెరకేక్కిస్తాడో చూడాలి. ఇక హిందీలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకేక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా మలయాళ,తమిళ బాషలలో కూడా రీమేక్ అవుతుంది.
