మెగా హీరో రికవరీ బాగానే చేస్తున్నాడు

prathiroju pandage

మెగా హీరో సాయి తేజ్ కొత్త చిత్రం ‘ప్రతిరోజూ పండగే’ మొదటిరోజు నుండి డీసెంట్ టాక్ తెచ్చుకుని విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. మొదటి మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.8.63 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం సోమవారం కూడా మంచి రన్ కనబర్చింది.

శుక్రవారం విడుదలైన ఇతర సినిమాలు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో సోమవారం కూడా ఈ చిత్రం మంచి షేర్ వసూలు చేయగలిగింది. ట్రేడ్ వర్గాల లెక్కల మేరకు 4వ రోజు ఈ సినిమా రూ.1.7 కోట్ల వరకు షేర్ అందుకుంది. దీంతో ఇప్పటివరకు థియేట్రికల్ బిజినెస్ నుండి 65 శాతం వరకు రికవరీ చేయగలిగింది. ఇక రేపు క్రిస్టమస్ కావడంతో వసూళ్లు ఇలాగే స్టడీగా కొనసాగే అవకాశం ఉంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించారు.

Exit mobile version