‘పంతం’ సినిమా విడుదలపై ఎలాంటి అనుమానాలొద్దు – నిర్మాత !

‘పంతం’ సినిమా విడుదలపై ఎలాంటి అనుమానాలొద్దు – నిర్మాత !

Published on Jun 18, 2018 2:38 PM IST

హీరో గోపిచంద్, మెహ్రీన్ జంటగా నూతన దర్శకుడు చక్రవర్తి తెరకెక్కించిన చిత్రం ‘పంతం’. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాత కే.కే.రాధామోహన్ మాట్లాడుతూ ఈ సినిమా విడుదల పై కొందరకి అనుమానాలు ఉన్నాయి. ముందునుంచి చెప్తున్నట్లుగానే జులై 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. ఈ నెల 21న ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకను విజయవాడలో జరిపి 24న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపనున్నాం .

మంచి బడ్జెట్లో గోపిచంద్ కెరీర్ లో నే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యేలా ఈ చిత్రాన్ని నిర్మించాం. సినిమా చాలా బాగా వచ్చింది అలాగే సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున్న చేపడుతున్నాం. మరొక్కసారి ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో జులై 5న విడుదలవుతుందని ఈ సందర్బంగా తెలియజేస్తున్నానని అన్నారు. మంచి సోషల్ కాజ్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చక్రవర్తి డైరెక్ట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు