తెలుగు ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినీ నిర్మాత వి.మహేశ్(85) గుండెపోటుతో చనిపోయారు. 1975లో మాతృమూర్తి సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన.. మనుషులంతా ఒక్కటే, మహాపురుషుడు, చిరంజీవితో సింహపురి సింహం, ముసుగు దొంగ సహా పలు సినిమాలు నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే, మనుషులంతా ఒక్కటే సినిమాకు ఉత్తమ కథా రచయితగా కూడా వి.మహేశ నంది అవార్డు అందుకున్నారు.
నెల్లూరు(D) కొరుటూరు వి.మహేశ్ సొంతూరు కాగా.. రేపు చెన్నైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిర్మాత వి.మహేశ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 123తెలుగు.కామ్ తరఫున వి.మహేశ్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.