2.0 కోసం మరో వంద కోట్లను ఖర్చుపెడుతున్నారు !

2.0 కోసం మరో వంద కోట్లను ఖర్చుపెడుతున్నారు !

Published on Jun 20, 2018 2:00 PM IST

సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన ‘2. 0’ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా ఏడాది అవుతుంది ఈ చిత్రం షూటింగ్ ను ముగించుకొని ఇంతవరకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు నిర్మాతలు. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఇప్పటికే రూ.400 కోట్లను ఖర్చు పెట్టారు ఈ చిత్ర నిర్మాతలు. ఇది కాకుండా మరో రూ.100 కోట్ల దాక ఖర్చు పెట్టిస్తున్నాడట డైరెక్టర్ శంకర్

సినిమా క్వాలిటీ విషయంలో రాజీపడని శంకర్ ఈ చిత్రం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం వల్లే నిర్మాతలపై అదనపు భారం పడుతోందని అంటున్నారు. ఈ చిత్ర విడుదల విషయంలో మరింత ఆలస్యం చేస్తే ప్రేక్షకులకు సినిమాపై ఉన్న ఆసక్తి రోజు రోజుకి సన్నగిల్లడం ఖాయం. మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దర్శక నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి .

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈసినిమాని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు