సెప్టెంబర్ నుండి మొదలుకానున్న గోపీచంద్ బయోపిక్ !

సెప్టెంబర్ నుండి మొదలుకానున్న గోపీచంద్ బయోపిక్ !

Published on Jun 12, 2018 12:55 PM IST

హీరో సుధీర్ బాబు ఈ వారం ‘సమ్మోహనం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. ప్రస్తుతం ఆయన పుల్లెల గోపీచంద్ బయోపిక్ కోసం సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ నుండి ఈ సినిమా మొదలుకానుంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు విజేత ‘ప్రవీణ్ సత్తారు’ దర్శకత్వం వహించనున్నారు.

ఈ చిత్రం ఒకేసారి హిందీ, తెలుగులో భాషల్లో రూపొందనుంది. ఈ సినిమా కోసం చాలా నెలల నుండి కష్టపడుతున్న సుధీర్ బాబు పుల్లెల గోపిచంద్ ను చాలా దగ్గరగా ఫాలో అయి సినిమా కోసం కావాల్సిన ఇన్ పుట్స్ తీసుకుంటున్నారట. ఈ చిత్రం గురించి సుధీర్ బాబు మాట్లాడుతూ ఇది చాలా ఛాలెంజింగ్ సినిమా అని, సన్నివేశాలు వాస్తవంగా ఉండటం కోసం నిజమైన ఇంటర్నేషనల్ టోర్నీలో పాల్గొనాలనే ఆలోచన కూడ చేశామని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు