బాలీవుడ్లో మరోసారి అదృష్టం పరీక్షించుకొబోతున్న పూరి

బాలీవుడ్లో మరోసారి అదృష్టం పరీక్షించుకొబోతున్న పూరి

Published on Mar 13, 2013 4:05 AM IST

Puri

పూరి జగన్నాధ్ ఒక హిందీ సినిమాకి సంతకం చేసాడు. తాజా సమాచారం ప్రకారం ‘సన్ ఆఫ్ సర్దార్’ సినిమా నిర్మాత ఎన్. ఆర్ పాచీసియా మన పూరిని ఒక సినిమా తన బ్యానర్ పై చెయ్యమని కోరాడంట. పూరి దానికి అంగీకరించి తన పాత హిట్ సినిమాని రీమేక్ చేస్తానని చెప్పాడు. తన పాత సినిమా ‘పోకిరి’ ని ‘వాంటెడ్’గా ప్రభుదేవా తీసాక పూరి ‘బిజినెస్ మాన్’ సినిమా రీమేక్ చేస్తాడని వార్తలొచ్చాయి. కానీ అది జరగలేదు.

అయితే ఎన్. ఆర్ పాచీసియా తనతో పూరి ఏ సినిమా తీస్తున్నాడో ఇంకా చెప్పలేదు. బహుశా 2004లో తను తీసిన ‘ఇడియట్’, ‘అమ్మా నాన్నా ఓ తమిళమ్మాయి’ సినిమాలలో ఒకటి తియ్యొచ్చు. పూరి ఇదివరకే తుషార్ కపూర్ హీరోగా ‘బద్రి’ సినిమాని ‘షార్ట్’గా తీసాడు. అమితాబ్ తో ‘బుడ్డా హోగా తేరా బాప్’ తో మరోసారి బాలీవుడ్ని పలకరించాడు. మూడోసారి అయినా పూరి పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుందాం.

ప్రస్తుతం పూరి అల్లు అర్జున్ , అమలా పాల్ మరియు కెథరీన్ త్రేస నటిస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా షూటింగ్లో స్పెయిన్లో బిజీగా ఉన్నాడు. దీని తరువాత మహేష్ బాబుతో మరో సినిమా చేస్తాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు