రాజ్ కందుకూరి చేతుల మీదుగా ‘ఏవమ్ జగత్’ నుంచి ‘పండగ పండగంటే ’ సాంగ్ రిలీజ్

రాజ్ కందుకూరి చేతుల మీదుగా ‘ఏవమ్ జగత్’ నుంచి ‘పండగ పండగంటే ’ సాంగ్ రిలీజ్

Published on Aug 7, 2021 2:00 PM IST

కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా తదితరులు ప్రధాన పాత్రల్లో, మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మిస్తున్న చిత్రం ‘ఏవమ్ జగత్’. దినేష్ నర్రా దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న “ఏవమ్ జగత్” సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో చిత్రీకరించిన రైతన్నల పాటను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.

ఈ సందర్భంగా..దర్శకుడు దినేష్ నర్రా మాట్లాడుతూ ‘ఏవమ్ జగత్’ చిత్రం రైతులకు సంబంధించిన చిత్రం. వ్యవసాయం మన దేశానికి ప్రధానం అనేది అందరికీ తెలిసిందే. అలాంటి వ్యవసాయం భవిష్యత్తు ఏంటి..? రాబోయే తరానికి కావలసిన ఆహార అవసరాలు తీర్చేటంత సాగు భూమి కానీ, పండించగల అనుభవం కానీ మన దేశ యువతకి ఉందా..? ఇందులో టెక్నాలజీ పాత్ర ఏంటి..? అనే అంశాలను ప్రధానంగా ‘ఏవం జగత్’ మూవీలో చూపిస్తున్నాం. రైతులందరు ఎంతో హుషారుగా జరుపుకునే పండుగ సంక్రాంతిపై ఓ పాటను ఇందులో చూపిస్తున్నాం. అదే పాటను ఇప్పుడు విడుదల చేశాం. వ్యవసాయానికి మానవ సంబంధాలతో ముడిపడి ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానం వెతికే ఒక 20 ఏళ్ల యువకుడి ( కమల్ ) కథే ‘ఏవం జగత్’. ఒక పల్లెటూరిలో సాగే ఈ కథలో, దేశ పరిస్థితులను, పురోగతికి అద్దం పట్టేలా కథా కథనాలు సాగుతాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించడంలో కమల్ ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. చివరికి తెలుసుకున్నది ఏంటి అనేది తప్పక చూడాలి. ‘ఏవం జగత్’ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే మూవీని మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు