‘గౌతమ్’ నిరీక్షణ ఫలించేలానే ఉంది !

‘గౌతమ్’ నిరీక్షణ ఫలించేలానే ఉంది !

Published on Aug 13, 2018 9:14 PM IST


గౌతమ్‌ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్‌ గా ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘మను’. కాగా నిన్న విడుదల అయినా ఈ చిత్రం ట్రైలర్‌ చిత్రం పై ఒక్కసారిగా అంచనాలను పెంచింది. ఓ విభిన్నమైన కథ కథనాలతో ఫణీంద్ర నర్శెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం విడుదల తేదీన అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.

సస్పెన్స్‌ థ్రిల్లర్‌, లవ్‌ ఎంటర్‌టైనర్‌ గా రాబోతున్న ‘మను’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7న నిర్వాణ సినిమాస్‌ బాగస్వామ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో కూడా బాగానే అంచనాలు ఉన్నాయి. ఐతే పది సంవత్సరాల క్రితం హీరోగా పరిచయమైనప్పటికీ ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు గౌతమ్ కు. మంచి సినిమా కోసం గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న గౌతమ్ కు మను చిత్రంతో మంచి విజయం అందనుంది ఫిల్మ్ వర్గాల నుండి సమాచారం అందుతుంది. మరి చూడాలి గౌతమ్ ఈ సినిమాతోనైనా విజయం సాధిస్తాడో లేదో !

సంబంధిత సమాచారం

తాజా వార్తలు