రాజన్న చిత్ర విజయం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు శుభ పరిణామం

రాజన్న చిత్ర విజయం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు శుభ పరిణామం

Published on Dec 22, 2011 9:40 AM IST

యదార్ధ సంఘటనల ఆధారంగా కింగ్ అక్కినేని నాగార్జున నటించిన చిత్రం ‘రాజన్న’. ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతుండగా నిన్న ఈ చిత్రాన్ని ప్రముఖలకు ప్రిమియర్ షో వేయడం జరిగింది. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాల బావుందని నాగార్జున గారి కెరీర్లో మర్చిపోలేని చిత్రం అవుతుందని చెప్పారు.రాజన్న చిత్ర విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మంచి శుభ పరిణామం. ఈ సంవత్సరం మొదటి భాగంలో ఎక్కువ విజయాలు లేకపోయినప్పటికీ ద్వితీయార్ధం మాత్రం మంచి విజయాలు దక్కాయి. అగ్ర హీరోలు కూడా విజయాలు దక్కించుకున్నారు. ‘శ్రీ రామ రామ రాజ్యం’ తో బాలకృష్ణ విజయం సాధించగా, ‘రాజన్న’ తో నాగార్జున పెద్ద విజయం సాధించారు. ‘దూకుడు’ తో మహేష్ భారీ హిట్టే సాధించారు.

ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర రికార్డుల మోత మోగించింది. ఎన్టీఆర్ నటించిన ‘ఊసరవెల్లి’ తో పర్వాలేదనిపించాడు. ఈ చిత్రం నిర్మాతకు నష్టాలు రాకుండా బయట పడింది. నవతరం నటులు రామ్ మరియు నారా రోహిత్ ‘కందిరీగ’ మరియు ‘సోలో’ చిత్రాలతో మంచి విజయాలు దక్కించుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ చిత్రం ‘పంజా’ తో పర్వాలేదనిపించాడు. అల్లు అర్జున్ ‘బద్రీనాథ్’ తో కమర్షియల్ విజయం సాదించాడు. ఈ విజయాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ కలకలాడుతోంది. వచ్చే ఏడాది కూడా ఇంత కంటే భారీ విజయాలు సాధించాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు