రకుల్ ప్రీత్ నయా వ్యాపారం అదిరిందిగా

రకుల్ ప్రీత్ నయా వ్యాపారం అదిరిందిగా

Published on Sep 14, 2019 8:25 PM IST

బ్యూటీ రకుల్ ప్రీత్ మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టారు. ఆమె టెన్నిస్ ప్రీమియర్ లీగ్ లో ఓ జట్టుకి కో-ఓనర్ గా మారారు. ఈ విషయాన్ని స్వయంగా రకుల్ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం రకుల్ ప్రీత్ ట్విట్టర్ లో ఆమె ‘ఫైన్ క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్’ జట్టును కొనుగోలు చేస్తున్నట్లుగా ధృవీకరిస్తూ ట్వీట్ చేయడం జరిగింది. ఐపీఎల్ స్పూర్తితో మొదలైన టిపిఎల్ ని టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి 2013లో స్థాపించడం జరిగింది.

ఇక ఈ ఏడాది డిసెంబర్ లో జరగనున్న ఈ ఈవెంట్ లో రకుల్ తన జట్టు సభ్యులను తన ఎనర్జీతో ఎంకరేజ్ చేయనున్నారన్న మాట. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రస్తుతం హిందీతో పాటు, ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఏదిఏమైనా రకుల్ అటు సినీ రంగంలో రాణిస్తూనే మరలా ఇలా టెన్నిస్ జట్టు ప్రాంచైజీలా మారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు