సాయి శ్రీనివాస్ కు జోడీగా స్టార్ హీరోయిన్ ?

సాయి శ్రీనివాస్ కు జోడీగా స్టార్ హీరోయిన్ ?

Published on Feb 14, 2019 6:13 PM IST

యంగ్ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్ దాదాపు తన అన్నిసినిమాల్లో స్టార్ హీరోయిన్స్ తోనే జోడిగా నటించాడు. తాజాగా ఇప్పుడు మరో సారి సాయి శ్రీనివాస్ కు జోడిగా క్రేజీ హీరోయిన్ ను తీసుకొన్నట్లు సమాచారం. రమేష్ వర్మ దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘రాక్షసన్ ‘రీమేక్ లో నటించనున్నాడు ఈ హీరో. ఇక ఈసినిమాకు సాయి కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ ను కానీ రాశి ఖన్నా ను గాని తీసుకోనున్నట్లు సమాచారం. ఈచిత్రం ఈనెల 21న లాంచ్ కానుంది.

ఇక ఒరిజినల్ వెర్షన్ లో విష్ణు విశాల్ , అమలా పాల్ జంటగా నటించారు. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు