మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వారాంతరంలో తన మొట్టమొదటి సెలబ్రిటీ క్రికెట్ లీగ్(సి.సి.ఎల్) ఆడుతున్నాడు. ఈ ఫిబ్రవరి 17న ముంబాయ్ హీరోస్ తో తలపడనున్న తెలుగు వారియర్స్ జట్టు తరపున పోటీకి దిగనున్నాడు. ప్రస్తుతం సి.సి.ఎల్ మూడో సీజన్ జరుగుతోంది. రామ్ చరణ్ తెలుగు వారియర్స్ జట్టులోకి ఈ జనవరిలో అధికారికంగా చేరి కొన్ని ప్రాక్టీస్ సెషన్లకి కూడా హారజయ్యాడు. సిలిగురిలో ఈ నెల మొదట్లో బెంగాల్ టైగర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆడలేదు.
రానున్న రెండురోజుల్లో ఎనిమిది వివిధ జట్ల మధ్య నాలుగు మ్యాచ్ లు హైదరాబాద్ లో జరగనున్నాయి. మలయాళం, తమిళ్, ముంబాయి, మరాఠీ, భోజ్ పురి, బెంగాలీ, కన్నడ మరియు తెలుగు సినీ పరిశ్రమలు, హైదరాబాద్లో ఫిబ్రవరి 16,17లో తలపడనున్నాయి. శృతి హాసన్ చెన్నై రైనోస్ టీంకి ఛీర్ గర్ల్ గా వ్యవహరించనుండగా, శ్రీదేవి బోనీ కపూర్, చిత్రాంగధ సింగ్, నర్గిస్ ఫఖ్రి, ప్రియమణి, జెనీలియా మరి కొంత మంది తారలు తమ తమ టీంలకు సహకారం అందించనున్నారు.