ఆ పాత్రకు రానాను అనుకుంటున్నారట

ఆ పాత్రకు రానాను అనుకుంటున్నారట

Published on Mar 27, 2020 11:00 PM IST

ఇటీవలే మలయాళంలో ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘అయ్యప్పనుమ్ కొశియుమ్’. బిజు మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను శాచి డైరెక్ట్ చేయడం జరిగింది. ఈగో కలిగిన ఇద్దరు బలమైన వ్యక్తులు తలపడితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా కథాంశం. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే పనులు మొదలయ్యాయి. ఈ చిత్ర రీమేక్ హక్కులు నిర్మాత నాగవంశీ వద్ద ఉన్నాయి.

ప్రస్తుతం ఆయన నటుల్ని వెతికే పనిలో ఉన్నారు. మొదట బిజు మీనన్ చేసిన అయ్యప్పనుమ్ పాత్రకు బాలకృష్ణను అనుకుంటున్నట్టు వార్తలు రాగా ఇప్పుడు పృథ్వీరాజ్ పోషించిన కొశియుమ్ పాత్రకు రానాను సెలెక్ట్ చేసుకున్నారని వినికిడి. ఇప్పటికే ఆయనతో చర్చలు కూడా జరుగుతున్నాయట. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అఫీషియల్ కనఫర్మేషన్ రాలేదు. లాక్ డౌన్ పిరియడ్ ముగిసి సినీ రంగం రీస్టార్ట్ అయ్యాక నిర్మాత నటీనటులు, దర్శకుడి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు