ప్రేమకథా చిత్రమ్ 2 కి వాయిస్ ఓవర్ అందించిన ప్రముఖ నటుడు !

ప్రేమకథా చిత్రమ్ 2 కి వాయిస్ ఓవర్ అందించిన ప్రముఖ నటుడు !

Published on Jan 20, 2019 6:28 PM IST

సూపర్ హిట్ హార్రర్ కామెడీ ‘ప్రేమకథా చిత్రమ్’ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమ కథా చిత్రమ్ 2’. నూతన దర్శకుడు హరికిషన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, నందిత శ్వేతా, సిద్ది ఇద్నాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ప్రముఖ నటుడు రావు రమేష్ వాయిస్ ఓవర్ అందించారు. ఆర్ పి ఏ క్రీయేషన్స్ పతాకం ఫై సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్న ఈచిత్రానికి జేబీ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రం యొక్క హిందీ శాటిలైట్ , డబ్బింగ్ రైట్స్ కోటి 43లక్షలకు అమ్ముడై య్యాయని సమాచారం.

ఇక ఈచిత్రాన్ని ఫిబ్రవరి 22 న విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. ఈచిత్రంలో ప్రభాస్ శ్రీను , విద్యుల్లేక రామన్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా హిలేరియస్ గా ఉండనున్నాయని సమాచారం. మరి మొదటి పార్ట్ లాగే ఈ సీక్వెల్ కూడా విజయాన్ని సాధిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు