వైరల్ అవుతున్న రష్మికా ఎమోషనల్ పోస్ట్.!

వైరల్ అవుతున్న రష్మికా ఎమోషనల్ పోస్ట్.!

Published on Nov 9, 2022 11:30 AM IST

నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కోసం మన సౌత్ ఇండియా లోనే కాకుండా నార్త్ ఆడియెన్స్ లో కూడా తెలియని వారు ఎవరూ ఉండరు, భారీ హిట్ పుష్ప తో పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ ని తెచ్చుకున్న ఈ యంగ్ హీరోయిన్ ఇప్పుడు మరిన్ని భారీ చిత్రాలు చేస్తూ చాలా బిజీగా ఉంది. అయితే లేటెస్ట్ గా రష్మికా పెట్టిన ఓ ఊహించని పోస్ట్ సోషల్ మీడియాలో మరియు తన అభిమానుల్లో అలాగే సినిమా శ్రేణుల్లో వైరల్ గా మారింది.

అయితే ఇందులో ఆమె తనపై వస్తున్న ట్రోల్స్ మరియు తన పై జరుపుతున్న అసత్య ప్రచారాలపై స్పందించింది. అందరిలానే నేను కూడా నా పని చేస్తూ అందరిని అలరించాలనే అనుకుంటానని కానీ అదే సమయంలో నా పై ట్రోల్, విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకునే దానిని కాదని.

కానీ ఇప్పుడు నేను అనని మాటలు అన్న మాటలు కూడా అన్నట్టు, మార్చి ప్రచారం చేస్తున్నారు అనేది నా దగ్గరకు రావడం మూలాన ఇప్పుడు ఎట్టకేలకు నేను కూడా స్పందించాల్సి వస్తుంది అని తెలిపింది. ఓపెన్ గా చెప్పాలంటే ఈ వార్తల వల్ల నాకు ఇండస్ట్రీ బయట నా పరిచయస్తులకి ఇదంతా హార్ట్ బ్రేకింగ్ గా ఉంటుంది అని ఎమోషనల్ అయ్యింది.

అయితే ఈ విమర్శల వాటి వల్ల నేను మరింత బలంగా మారే ప్రయత్నం చేస్తాను అని చివరి మాటలుగా అందరూ అందరి పట్ల దయాగుణంతో ఉందాం కస్టపడి పని చేద్దాం అని చెప్పి రష్మికా ఈ ఎమోషనల్ పోస్ట్ ని పెట్టి హాట్ టాపిక్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు