స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య సిరీస్ తరువాత మరో చిత్రం తెరకెక్కనుందని తెలిసిందే. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మండన్న కథానాయికగా నటించనుందని సమాచారం.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం ఆగస్టు లో స్టార్ట్ కానుంది. ఇక అల్లు అర్జున్ ఈ సినిమా కన్నా ముందు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి లో వుంది. ఏప్రిల్ చివర్లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుందట. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా బన్నీ మూడవ సారి నటించనున్నాడు. మరి త్రివిక్రమ్ ,సుకుమార్ తో అల్లు అర్జున్ హ్యాట్రిక్ విజయాలను సాదిస్తాడో లేదో చూడాలి.