మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న సోషియో ఫాంటసి ఎంటర్టైనర్ చిత్రం ‘దరువు’ మార్చిలో విడుదలకు సిద్ధమవుతుంది. విశ్వసనీయ సమాచార ప్రకారం చిత్ర నిర్మాత మార్చి 15న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర యూనిట్ త్వరలోనే హైదరాబాద్ రానుంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్నారు. రవితేజ సరసన తాప్సీ హీరొయిన్ గా నటిస్తుంది. తాప్సీ గతంలో రవితేజ సరసన ‘వీర’ చిత్రంలో నటించింది. రవితేజ చాలా వేగంగా చిత్రాలు పూర్తి చేస్తున్నాడు. అతను నటించిన ‘నిప్పు’ ఈ వారంలో విడుదల కాబోతుండగా దరువు చిత్రం కాకుండా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం కూడా త్వరలోనే బ్యాకాక్ లో ప్రారంభం కానుంది. 2012 లో రవితేజ నటించిన మూడు చిత్రాలు పైగా విడుదల కాబోతున్నాయి.
మార్చిలో దరువు వేస్తానంటున్న రవితేజ!
మార్చిలో దరువు వేస్తానంటున్న రవితేజ!
Published on Feb 13, 2012 9:55 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : రత్నం – సిల్లీ యాక్షన్ ఎంటర్ టైనర్!
- మీకు తెలుసా? : కమల్ తో సౌందర్య చేయాల్సిన మొదటి సినిమా ఇదని
- లెటర్బాక్స్డ్ టాప్ 100 లో మహేష్ బాబు డబుల్ బొనాంజా
- ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో “ఓ మై గాడ్ 2” తెలుగు
- ‘అఖండ – 2’ : ఆ రోజున అనౌన్స్ మెంట్ రానుందా ?
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఫ్యామిలీ స్టార్’
- బజ్ : మ్యూజికల్ అప్ డేట్ కి రెడీ అవుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ ?