మార్చిలో దరువు వేస్తానంటున్న రవితేజ!

మార్చిలో దరువు వేస్తానంటున్న రవితేజ!

Published on Feb 13, 2012 9:55 AM IST


మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న సోషియో ఫాంటసి ఎంటర్టైనర్ చిత్రం ‘దరువు’ మార్చిలో విడుదలకు సిద్ధమవుతుంది. విశ్వసనీయ సమాచార ప్రకారం చిత్ర నిర్మాత మార్చి 15న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర యూనిట్ త్వరలోనే హైదరాబాద్ రానుంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్నారు. రవితేజ సరసన తాప్సీ హీరొయిన్ గా నటిస్తుంది. తాప్సీ గతంలో రవితేజ సరసన ‘వీర’ చిత్రంలో నటించింది. రవితేజ చాలా వేగంగా చిత్రాలు పూర్తి చేస్తున్నాడు. అతను నటించిన ‘నిప్పు’ ఈ వారంలో విడుదల కాబోతుండగా దరువు చిత్రం కాకుండా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం కూడా త్వరలోనే బ్యాకాక్ లో ప్రారంభం కానుంది. 2012 లో రవితేజ నటించిన మూడు చిత్రాలు పైగా విడుదల కాబోతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు