“పుష్ప”పై కొనసాగుతున్న రూమర్.!

“పుష్ప”పై కొనసాగుతున్న రూమర్.!

Published on Apr 14, 2021 1:00 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “పుష్ప”. హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న దీనిపై గట్టి అంచనాలు ఉన్నాయి. మరి అలాగే లేటెస్ట్ గా వచ్చిన టీజర్ కు అయితే నెవర్ బిఫోర్ రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఇదే టైం లోనే ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ రూమర్ స్ప్రెడ్ అవ్వడం కూడా మొదలయ్యింది.

ఈ సినిమా ఆగస్ట్ రేస్ నుంచి డిసెంబర్ కు షిఫ్ట్ అయ్యింది అని ఓ టాక్ మొదలు కాగా అది కాస్త ఇప్పుడు మరింత అవుతుంది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేనప్పటికీ ఇతర ఇండస్ట్రీలలో కూడా ఇంకా కొనసాగుతుంది. మరి దీనిపై మేకర్స్ మళ్ళీ ఓ క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు