కేరళ వరద బాధితుల సహాయం కోసం ‘ఆర్ ఎక్స్ 100’ బైక్ వేలం !

కేరళ వరద బాధితుల సహాయం కోసం ‘ఆర్ ఎక్స్ 100’ బైక్ వేలం !

Published on Aug 21, 2018 2:33 AM IST

కేరళ వరద బాధితుల పునరావాసం కోసం ఇప్పటికే పలు చిత్ర పరిశ్రమల్లోని పలువురు ప్రముఖులు తమ ఉదార స్వభావంతో విరాళాలు ప్రకటిస్తున్నారు. మన తెలుగు సినీపరిశ్రమ నుండి ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగార్జున ఇలా చాలామంది స్టార్ హీరోలు వరద భాదితులకు తమ సాయం అందించారు. కాగా తాజాగా ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో భారీ విజయాన్ని సాధించింది ఆ చిత్రబృందం.

ఐతే కేరళ వరద బాధితుల సహాయం అందించాలనే సదుద్దేశ్యంతో ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రం విజయానికి కీలక పాత్ర పోషించిన యమహా ఆర్ ఎక్స్ 100 బైక్ ను వేలం వేసి ఆ వచ్చిన మొత్తాన్ని వరద భాదితులకు అందివ్వబోతున్నామని ప్రకటించింది చిత్రబృందం. కనీస బిడ్డింగ్ మొత్తాన్ని రూ. 50,000 గా నిర్ణయించారు. ఆసక్తిగల వారు వారి బిడ్డింగ్ మొత్తాన్ని ఈ 9100445588 నెంబర్ కు వాట్సాప్ చెయ్యగలరు. లేదా ఈ మెయిల్ ఐడి rx100auction@gmail.com. మెయిల్ చెయ్యగలరు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు