యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరెకెక్కిన ‘సాహో’ చిత్రం నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం బలమైన ఓపెనింగ్స్ సాధించింది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 80 కోట్ల షేర్ ను సాధించింది. అయితే ఈ చిత్రం సేఫ్ జోన్ లోకి వెళ్లాలంటే 120 కోట్ల మార్క ను దాటాల్సిన అవసరం ఉంది.
కాగా ప్రస్తుతానికి వస్తోన్న కలెక్షన్స్ ను బట్టి చూస్తే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే. టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియస్ ప్రోడక్షన్ హౌస్ యువి క్రియెషన్స్ బ్యానర్ లో వంశి, ప్రమెద్, విక్రమ్ లు సంయుక్తంగా నిర్మించారు.