డబ్బింగ్ మొదలెట్టిన ‘సైరా నరసింహారెడ్డి’ !

డబ్బింగ్ మొదలెట్టిన ‘సైరా నరసింహారెడ్డి’ !

Published on Jun 17, 2019 3:37 PM IST

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ డబ్బింగ్ ఈ రోజు శబ్ధాలయ స్టూడియోస్‌ లో మొదలైంది. మొదట మెగాస్టార్ చిరంజీవినే తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. అలాగే సీజీ వర్క్ సంబంధించి కూడా ప్రస్తుతం వివిధ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఆగష్టు మూడో వారం కల్లా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్ని పూర్తవుతాయట.

ఇక చిత్రాన్ని అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చెయ్యాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 2న రిలీజ్ చేస్తే.. రెండో వారం నుండి దసరా సెలవులు కూడా తమ సినిమాకు కలిసొస్తాయని చిత్రబృందం ఆలోచిస్తోంది. అందుకే అక్టోబర్ 2ను ఫైనల్ చేసింది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తున్నారు.

అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు