వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా విశాల్ “సామాన్యుడు”

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా విశాల్ “సామాన్యుడు”

Published on Apr 3, 2022 8:35 AM IST

విశాల్ హీరోగా తు పా శరవణ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం సామాన్యుడు. ఈ చిత్రం ను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ మరియు మాలిక్ స్ట్రీమ్ కార్పొరేషన్ పతాకంపై సంయుక్తం గా నిర్మించడం జరిగింది. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయి ప్రేక్షకులను అలరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

ఈ యాక్షన్ థ్రిల్లర్ వచ్చే ఆదివారం ఏప్రిల్ 10, 2022 న జీ తెలుగు లో ప్రసారం కానుంది. డింపుల్ హాయాతీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు