ప్రముఖ నటుడు మాదాల రంగారావు అస్తమయం !

ప్రముఖ నటుడు మాదాల రంగారావు అస్తమయం !

Published on May 27, 2018 10:43 AM IST

ప్రముఖ నటుడు, నిర్మాత మాదాల రంగారావు అనారోగ్యంతో కన్నుమూశారు . గత కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రంగారావు ఈ నెల 19 న ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు .ఈ క్రమంలో ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో ఈ రోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రంగారావు ఎర్రమల్లెలు, స్వరాజ్యం,జనం మనం, ప్రజా శక్తి తదితర చిత్రాలలో నటించి ‘రెడ్ స్టార్’ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1980 లో విప్లవాత్మక చిత్రాలు నిర్మించి మంచి విజయాలను అందుకున్నారు అయన .

ప్రకాశం జిల్లా ఒంగోలు లో జన్మించిన మాదాల రంగారావు ప్రజా నాట్య మండలి, కమ్మూనిస్టు పార్టీలతో మంచి అనుబంధం ఉంది . ఈయన తీసిన ‘యువతరం కదిలింది’ చిత్రానికి గానుఅప్పటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి బంగారు నంది అవార్డు ని గెలుచుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు