సైరా కొరకు నయనతార పారితోషకం, హీరోలకు మించి…!

సైరా కొరకు నయనతార పారితోషకం, హీరోలకు మించి…!

Published on Sep 7, 2019 4:18 PM IST

ప్రతిష్టాత్మ సైరా చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఐతే ఈ చిత్రంలో చిరు సరసన నటిస్తున్న నయనతార పారితోషం గురించి ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రం కొరకు నయనతార ఏకంగా 6.3 కోట్ల పారితోషికం తీసుకున్నారట.

సౌత్ లో రెండవ తరగతి హీరోలు కూడా అంత రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. నయన డిమాండ్ అలా ఉంది మరి. సౌత్ లోనే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా నయన తార పేరుగాంచింది. ఆమెకు వున్న పాపులారిటీ రీత్యా నయనతార లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో ఎక్కువగా నటిస్తున్నారు. ఏది ఏమైనా సైరా కొరకు ఆమె తీసుకున్న పారితోషకం గురించి తెలిసిన వేరెవరైనా నోరెళ్లబెడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు