మెగా కాంపౌండ్లో ముచ్చటగా ముగ్గురితో మన హీరొయిన్

మెగా కాంపౌండ్లో ముచ్చటగా ముగ్గురితో మన హీరొయిన్

Published on Mar 14, 2013 3:09 PM IST

Shruthi

2012 నుండీ మంచి ఫామ్ లో ఉన్న మెగా హీరోలలో ఒక్కరి సరసన నటించడానికైనా హీరొయిన్లు తహతహలాడిపోతున్నారు. అలాంటిది ముగ్గురితోనూ కలిసి నటించాలంటే ఒక్క నక్క తోక తొక్కితే సరిపోదు. ఇప్పటివరకూ ఆ ఫీట్ ని కేవలం తమన్నా మాత్రమే సాదించింది. పవన్ సరసన ‘కెమేరామాన్ గంగతో రాంబాబు’, రామ్ చరణ్ తో ‘రచ్చ’, అల్లు అర్జున్ తో ‘బద్రీనాథ్’ సినిమాలలో నటించింది.
ఇప్పుడు ఆ ఫీట్ ని మరో సుందరి కుడా సాదిస్తానంటుంది. పవర్ స్టార్ పవర్ ఫుల్ హిట్ ‘గబ్బర్ సింగ్’లో నటించిన చార్మింగ్ గర్ల్ శ్రుతి హాసన్.. ఇప్పుడు రామ్ చరణ్ సరసన ‘ఎవడు’ లో నటిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘రేసు గుర్రం’ లో శ్రుతినే బుక్ చేసుకున్నాడట. శ్రుతి ఈ చిత్రాలలో గనుక మెప్పిస్తే టాలీవుడ్లో వెనుతిరిగి చూస్కొవక్కర్లేద్దు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు