మరో రెండు రోజుల్లో బుల్లితెరపై “శ్యామ్ సింగ రాయ్” బ్లాస్ట్.!

మరో రెండు రోజుల్లో బుల్లితెరపై “శ్యామ్ సింగ రాయ్” బ్లాస్ట్.!

Published on Apr 1, 2022 5:00 PM IST


నాచురల్ స్టార్ నాని హీరోగా మరో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా అలాగే కృతి శెట్టి మరో హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ చిత్రం నాని కెరీర్ లోనే భారీ హిట్ అయ్యింది.

మరి అప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుందో ఆ తర్వాత కూడా ఓటిటి లో వచ్చి మరింత స్థాయిలో రీచ్ తో సాలిడ్ టాక్ ని నేషనల్ వైడ్ తెచ్చుకుంది. మరి ఇప్పుడు తెలుగు బుల్లితెర పై ఫస్ట్ టైం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

మరో రెండు రోజుల్లో జెమినీ టీవిలో ఉగాది కానుకగా ఏప్రిల్ 3న సాయంత్రం 6 గంటలకి ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది. మరి బుల్లితెరపై శ్యామ్ సింగ రాయ్ బ్లాస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందివ్వగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు