ఎమోషనల్ ఎంటర్ టైనర్ లో మాస్ రాజా !

ఎమోషనల్ ఎంటర్ టైనర్ లో మాస్ రాజా !

Published on Aug 28, 2019 10:33 PM IST

దర్శకుడు అజ‌య్ భూప‌తి “ఆర్ఎక్స్ 100” సినిమాతో సంచలన విజయం సాధించినా.. రెండో సినిమాకి మాత్రం బాగా విరామం తీసుకున్నాడు. అయితే అజ‌య్ భూప‌తి ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో తన రెండో సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో క్లాస్ హీరో అనిపించుకున్న సిద్ధార్థ్ కూడా మరో హీరోగా నటిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కాగా ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. సినిమాలో సిద్ధార్థ్ పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

ఈ మధ్య అయితే సిద్ధార్థ్ తెలుగు సినిమాలు చెయ్యలేదు. వరుసగా తమిళ సినిమాలే చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘మహాసముద్రం’ అని టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో రవితేజకి జోడిగా అదితిరావు హైదరీ నటించనుంది. అక్టోబర్ మొదటి వారం నుండి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాను జెమిని కిరణ్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు