రొమేనియా వెళ్లనున్న సాహో టీం !

రొమేనియా వెళ్లనున్న సాహో టీం !

Published on Aug 10, 2018 11:31 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ఈచిత్రం యొక్క ముఖ్యమైన షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇక ఈ షెడ్యూల్ తరువాత చివరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ రొమేనియా వెళ్లనుంది. అక్కడ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించనున్నారు. దాంతో షూటింగ్ పూర్తి కానుంది. ‘రన్ రాజా రన్’ ఫెమ్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు