విజయం కోసం మరోసారి ఆ ప్రముఖ గాయకుడినే నమ్ముకుంటున్న రజినీ !

విజయం కోసం మరోసారి ఆ ప్రముఖ గాయకుడినే నమ్ముకుంటున్న రజినీ !

Published on Jun 25, 2018 11:54 PM IST


తలైవా రజినీకాంత్ నటించిన సినిమాల్లో ప్రముఖ గాయకుడూ ఎస్ పి బాలసుబ్రమణ్యం గారి చేత ఇంట్రడక్షన్ సాంగ్ పాడించడం సెంటిమెంట్ గా వస్తుంది. ఆలా ఆయన తో పాడించినా సినిమాలన్ని సూపర్ హిట్ అయ్యాయి అయితే ఇటీవల పరాజయం పాలైన కబాలి , కాలా చిత్రాల్లో బాలు పాడలేదు .దాంతో ఈ సెంటిమెంట్ ను రిపీట్ చేయనందుకే ఆ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు .

దాంతో ఇప్పుడు ఫిజ్జా ఫెమ్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజినీ నటిస్తున్న చిత్రంలో మళ్ళి బాలు చేత ఇంట్రడక్షన్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ సారి కూడా ఈ సెంటిమెంట్ ఫలించి ఈ చిత్రం భారీ విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఈచిత్ర షూటింగ్ డార్జిలింగ్ లో జరుగుతుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి , బాబీ సింహ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు