భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ వ్యక్తులలో ఒకరైన బాపుగారి పార్థీవ దేహాన్ని చెన్నైలో ఈరోజు దహన సంస్కారాలు నిర్వహించారు. ఆయన గౌరవార్దం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో వున్న మ్యుజియంని బాపు గారి పేరున మార్చనున్నారు
తెలుగుదనానికి మచ్చుతునకగా నిలిచిన బాపు ఈ ఆదివారం చెన్నైలో ఒక ప్రైవేటు హాస్పటల్ లో తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్ ప్రముఖులు నేడు చెన్నైలో ఈ దర్శకదిగ్గజానికి నివాళిని అర్పించారు


