టామ్ హాలండ్, జెండాయా ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (Spider-Man: Brand New Day) భారత బాక్సాఫీస్ వద్ద బలమైన వసూళ్లతో నిలకడగా రాణిస్తోంది. విడుదలైన 12 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 500 కోట్ల మార్కును దాటింది. రెండో వారంలోనూ ఈ సినిమా కలెక్షన్లు స్థిరంగా నమోదవుతున్నాయి.
రూ. 600 కోట్ల గ్రాస్ దిశగా..
3డీ వెర్షన్తో కలిపి మొత్తం గ్రాస్ వసూళ్లు రూ. 520 కోట్లకు చేరుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. త్వరలో రాబోతున్న ‘బట్వారా 1947’, ‘ఆవారాపన్ 2’ చిత్రాల నుంచి పోటీ ఎదురైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద హోల్డ్ సాధిస్తే ఫుల్ రన్లో ఈ చిత్రం రూ. 600 కోట్ల గ్రాస్, రూ. 500 కోట్ల నెట్ సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత వసూళ్లు మరియు థియేటర్లలో నమోదువుతున్న ఆక్యుపెన్సీ ఆధారంగా ట్రేడ్ వర్గాలు ఈ చిత్రాన్ని ‘ఆల్ టైమ్ బ్లాక్బస్టర్’గా పేర్కొంటున్నాయి. భారత్లో ఇప్పటివరకు ఈ సినిమాను దాదాపు 1.7 కోట్ల మంది థియేటర్లలో చూశారు. గతంలో హాలీవుడ్ నుంచి కేవలం ‘టైటానిక్’, ‘అవెంజర్స్: ఎండ్గేమ్’ చిత్రాలను మాత్రమే మన దేశంలో 2 కోట్ల మందికి పైగా వీక్షించారు. ఇప్పుడు ఆ జాబితాలో చేరేందుకు ‘స్పైడర్-మ్యాన్’ వేగంగా దూసుకెళ్తోంది.


