‘శ్రీనివాస కళ్యాణం’కు సోమవారం చుక్కెదురు !

‘శ్రీనివాస కళ్యాణం’కు సోమవారం చుక్కెదురు !

Published on Aug 14, 2018 2:55 PM IST

దిల్ రాజు నిర్మాణంలో నితిన్ , రాశి ఖన్నా జంటగా ‘శతమానం భవతి’ ఫెమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ఆగస్టు 9న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్సడ్ టాక్ ని తెచ్చుకొంది. కుటుంభ కథా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడం తో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న యూత్ మాత్రం కనెక్ట్ కాలేకపోతున్నారు. ఇక మొదటి రెండు రోజులు మోస్తారు కలెక్షన్స్ ను రాబట్టిన ఈ చిత్రం శని, ఆది వారాల్లో మాత్రం మంచి కలెక్షన్స్ రాబట్టడంతో దిల్ రాజు ఊపిరి పీల్చుకున్నారు. వచ్చే వారం కూడా ఇదే హావ కొనసాగుతుందని భావించిన ఆయన ఆశల ఫై సోమవారం నీళ్లు చల్లింది.

నిన్న కనీసం థియేటర్లలో 30శాతం ఆక్యుపెన్సీ కూడా లేకుండా పోయింది. దాంతో నిన్నటివరకు 9కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టుకోగలిగింది. ఇంకా సగానికి పైగా రికవరీ చేస్తేనే ఈచిత్రం సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది. ఇక రేపటినుండి ‘గీత గోవిందం’ థియేటర్లలో సందడి చేయనుంది. దానికి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్ర కలెక్షన్స్ కు భారీ గా గండిపడడం ఖాయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు