నైజాం లో శ్రీనివాస కళ్యాణం అంచనాలను అందుకోలేకపోయింది !

నైజాం లో శ్రీనివాస కళ్యాణం అంచనాలను అందుకోలేకపోయింది !

Published on Aug 16, 2018 6:47 PM IST

నితిన్ , రాశి ఖన్నా జంటగా ‘శతమానం భవతి’ ఫెమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ఆగస్టు 9న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోగా యూత్ ను మాత్రం ఏ మాత్రం మెప్పించలేకపోయింది. దాంతో ఈచిత్రం యొక్క కలెక్షన్స్ కూడా నామామాత్రంగానే వున్నాయి. ఇక నైజాం లో ఈ చిత్రం ఇప్పటివరకు 4. 7 కోట్ల షేరును మాత్రమే రాబట్టుకోగలిగింది.

ఇక నితిన్ ,దిల్ రాజు లు ఈచిత్రం ఫై భారీ ఆశలే పెట్టుకున్న ప్రేక్షకులనుండి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో ఈ చిత్రం కూడా ఈ ఇద్దరిని తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రానికి ‘గీత గోవిందం’ రూపంలో గట్టి ఎదురుదెబ్బతగులుతుంది. నిన్న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. దాంతో శ్రీనివాస కళ్యాణం చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిని చూపించడం లేదు. ఇక ఈ సినిమాతో కూడాదిల్ రాజు కు నష్టాలు తప్పేలా లేవు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు