సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. పెళ్లి నేపథ్యంలో ఆగస్టు 9న విడుదల అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ ఆడియన్స్ ని మరియు విలేజ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నే విధంగా ఉన్నప్పటికీ బాగా మిక్స్ డ్ టాక్ రావటంతో కలెక్షన్స ఆశించినంత స్థాయిలో ఆశాజనకంగా లేవు.
ఇక ఈ చిత్రం నాలుగు రోజులకు గాను ఏపీ తెలంగాణలో 8.5 కోట్ల షేర్ ను రాబట్టిగలిగింది. మరి ఈ సోమవారం ఎలా సస్టైన్ అవుతుందో చూడాలి. ఏమైనా ఈ చిత్రం సేఫ్ ప్రాజెక్ట్ గా నిలవడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో నితిన్ సరసన రాశి ఖన్నా నటించారు.