‘శ్రీనివాస కళ్యాణం’ ముహూర్తం ఖారారు అవ్వబోతుంది !

‘శ్రీనివాస కళ్యాణం’ ముహూర్తం ఖారారు అవ్వబోతుంది !

Published on Jul 18, 2018 11:21 AM IST


నితిన్ హీరోగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని జరుపుకుంటుంది. ఆగష్టు మొదటి వారానికి కల్లా అన్ని పనులు ముగియనుండటంతో ఆగష్టు 9వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.

అయితే త్వరలో ఈ చిత్ర టీజర్ ను విడుదల చేయడంతో పాటు, ఆడియో ఫంక్షన్ ను కూడా ఘనంగా జరపనున్నారు. ఎప్పుడనేది రేపు ఉదయం 9 గంటలకు అధికారికంగా ప్రకటిస్తామని చిత్రబృందం పోస్టర్ విడుదల చేసింది. ఈ చిత్రం మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా రాశీఖన్నా, నందిత శ్వేతలు కథానాయకిలుగా నటిస్తున్నారు. పూర్తి స్థాయి రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమా పై నితిన్ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. మరి నితిన్ ఆశించినట్లు ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు